మొండి 20 పగ
telugu stories kathalu novels మొండి 20 పగ బాధతో కుమిలిపోతున్న వీరు కి సంతోష్ చెప్పిన మాటలు కొంత క్లారిటీ తో పాటు మరి కొన్ని ప్రశ్నల్ని రేకెత్తించాయి. ఒకవైపు రవి సార్ ని చంపిన వారిపై పగ తీర్చుకోవాలని కోపం, మరొకవైపు ఎవరినీ నమ్మకు అని సంతోష్ చెప్పిన మాట. అంటే డిపార్ట్మెంట్లో కూడా దొంగలు ఉన్నారా? అన్న అనుమానం అతనిని మరింత అలజడిలో పెట్టేసేయ్.
ఆఫీస్నుంచి నేరుగా ఇంటికి బయలుదేరిన వీరుకి దివ్య నుండి ఫోన్ కాల్ వచ్చింది. ఇలాంటి సమయంలో ఏ బాధనైనా చెప్పుకోవడానికి ఈ ప్రపంచంలో తనకు మిగిలిన ఏకైక వ్యక్తి దివ్య నే.రూమ్ కి వచ్చి చూస్తే దివ్య వీరు కోసం ఎదురుచూస్తూ ఉంది. ఆశ్చర్యపోయిన వీరు, దివ్యని అలా చూస్తూ నిల్చుండి పోయాడు. స్కూటీ ఎక్కు అని చెప్పి దివ్య, వీరుని తన ఇంటికి తీసుకెళ్ళి పోయింది. వాళ్ళ అమ్మానాన్న కు రాత్రి వీరు తమ ఇంట్లోనే ఉంటాడు అని చెప్పింది. వాళ్ళు కూడా రవి ఉదంతం గురించి విని ఉన్నారు. సరే అని ఊరుకున్నారు.
ఇద్దరు కలిసి స్టడీ రూమ్ లో కూర్చుని ఉన్నారు. ఇంతక ముందులా గలగలా మాటలు అక్కడ పారడం లేదు. వీరుకి ఏం మాట్లాడాలో తెలియక అలా సైలెంట్ గా ఉన్నాడు. దివ్య అతని పక్కన కూర్చుంది కానీ తాను కూడా ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. కాసేపటి పాటు వారిద్దరి మధ్య నిశ్శబ్దం మాత్రమే మాట్లాడింది. వీరు నెమ్మదిగా రవి గురించి చెప్పడం మొదలు పెట్టాడు.
"నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా నేర్చుకున్నాను అంటే, అది నీ దగ్గర రవి సార్ దగ్గర మాత్రమే" అన్నాడు వీరు.
ఆ మాటలు అంటూనే అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
దివ్య కూడా ఒక్కక్షణం ఆగి
"నువ్వెంత పెయిన్ లో ఉన్నావు నేను అర్థం చేసుకోగలను" అని అంది
"నాకు ఎవరి దగ్గరైతే దూరమై పోతున్నారు దివ్య.నాతో కొంతకాలం మాట్లాడకు"
"ఎందుకు " అని అడిగింది దివ్య.
"మొన్న పొద్దున్న కూడా నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏదోలా ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఉన్నట్టుండి అలా మాయమైపోయాడు మనిషి. నువ్వు కూడా ఆలా దూరమై