రాజ్య సింహాసనం 27

By | December 6, 2019
రాజ్య సింహాసనం 27 కొద్దిసేపు వాళ్ళందరూ మాట్లాడుకున్న తరువాత రత్నసింహుడు, కళావతి అక్కడ నుండి వెళ్ళిపోయారు. రమణయ్య మత్రం గంభీరంగా ఉండటం చూసి ఆదిత్యసింహుడు అతని వైపు చూస్తూ…. ఆదిత్యసింహుడు : ఏమయింది రమణయ్య గారూ….అంత గంభీరంగా ఉన్నారు…. రమణయ్య : ఏం లేదు ప్రభూ….మీరు ప్రభావతి గారితో ఏం సంభాషించారు....రాకుమారి ఎలా ఒప్పుకున్నది… దాంతో ఆదిత్యసింహుడు జరిగింది మొత్తం వివరంగా చెప్పాడు. రమణయ్య : (అంతా విన్న తరువాత) సమస్య పైకి మామూలుగా కనిపిస్తున్నా….అంతర్గతంగా చాలా భీకరంగా ఉన్నది ప్రభూ….. ఆదిత్యసింహుడు : అవును….నాక్కూడా అదే అర్ధం కావడం లేదు….ప్రస్తుతానికి ఇంతకు మించిన పరిష్కారం కూడా నాకు తోచడం లేదు….. రమణయ్య : ముందు రాకుమారిని నిలువరిస్తే…మన రాజ్యానికి వెళ్ళిన తరువాత శాశ్వత పరిష్కారం అలోచించొచ్చు… ఆదిత్యసింహుడు : నాక్కుడా అంతే అనిపిస్తున్నది…(అంటూ అతని వైపు చూస్తూ) ఇంతకు మీరు ఇందాక మధ్యలో ఎక్కడకు వెళ్ళారు…. రమణయ్య : (దీర్ఘంగా శ్వాస పీలుస్తూ) ఇదివరకు మీరు, రాకుమారి మాట్లాడుకుంటున్న మాటలు ఒక గూఢచారి విన్నాడు…(అంటూ తన దుస్తుల్లో నుండి ఒక వస్తువుని తీసి ఆదిత్యసింహుడికి ఇస్తూ) దీనిని గుర్తించారా…. ఆదిత్యసింహుడు : (ఆ వస్తువుని తీసుకుని పరీక్షగా చూస్తూ) అవును….ఇది….. రమణయ్య : మీరు ఊహించినది సబబే ప్రభూ….ఆ గూఢచారి మీ అన్నగారు వీరసింహుడి తాలూకా…. ఆదిత్యసింహుడు : మరి అతన్ని ఏం చేసారు….మేము మాట్లాడుకున్నవి అన్నీ వినేసాడు…. రమణయ్య : మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభూ….కంటిని కాపాడుకోమని కనురెప్పకు చెప్పాలా….నేను ఇంతకు ముందే అతన్ని చంపేసాను….శవం కూడా ఆచూకీ దొరకదు

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *