రాజ్య సింహాసనం 28
రాజ్య సింహాసనం 28 పద్మ : మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది ప్రభూ….ఇక లోపలికి దయ చేస్తే….మీరు విశ్రాంతి తీసుకుందురు గాని….
ఆదిత్యసింహుడు : సరె….పద….
ఇద్దరూ లోపలికి వెళ్లారు.
పద్మ ఆ భవంతిలోని విశాలమైన గదిలోకి తీసుకెళ్ళింది.
ఆ గది మధ్యలో పెద్ద హంసతూలికా తల్పం…దాని పక్కనే చిన్న బల్ల మీద పళ్ళు, పాలు, మంచినీళ్ళు, మదిర...అంతా సుందరంగా అమర్చిఉన్నాయి.
పద్మ : ఇది మీ శయ్యామందిరం ప్రభూ….మీకు ఏమైనా కావాలంటే సెలవిస్తే వాటిని మీ ఇష్టానికి తగ్గట్టుగా చేరేలా చూస్తాను….
ఆదిత్యసింహుడు : మీ రాజ్యపు అతిధి మర్యాద చాలా బాగున్నది పద్మ….మేము చాలా సంతోషంగా ఉన్నాము…
పద్మ : చాలా ధన్యురాలము ప్రభూ….
ఆదిత్యసింహుడు : సరె….ఇప్పుడు ప్రభావతితో పాటుగా మా రాజ్యానికి నువ్వు కూడా వస్తున్నావా….
పద్మ : (ఒక గ్లాసులో మదిరను పోస్తూ) అంతే కదా ప్రభూ….రాకుమారితో పాటే నేను….ఇంకా దాదాపు యాభై మంది పరిచారికలం వస్తున్నాము….
ఆదిత్యసింహుడు : అందరి సంగతి మాకెందుకు పద్మా….నువ్వు వస్తున్నావు కదా….
పద్మ : (చిన్నగా నవ్వుతూ ఆదిత్యసింహుడి దగ్గరకు వచ్చి మదిర గ్లాసుని అతని చేతికి ఇస్తూ) ఈ దాసీ మీద అంత మక్కువ ఏంటి ప్రభూ…..మాలాంటి వారి మీద మీలాంటి రాకుమారుల చూపు పడటమే మా అదృష్టంగా భావిస్తాము… అలాంటిది మీరు నా మీద….(అంటూ ఇక మాట్లాడలేకపోయింది.)
ఆదిత్యసింహుడు : (ఆమె చేతిలో మదిర గ్లాసుని అందుకుని తాగుతూ) మరి….ఇంత అందమైన పరిచారిక మా రాజభవనంలో లేకపోతే ఎలా….(అంటూ ఇంకో చేత్తో ఆమె చెయ్యి పట్టుకుని మీదకు లాక్కున్నాడు.)
పద్మ : మీరు ఏంటి ప్రభూ…