వంశాచారం 22
naa telugu kathalu వంశాచారం 22 సుబ్బమ్మ దగ్గర వున్న రెండు బంగారు గాజులని చూసిన దాని మొగుడు తిప్పడు , ఇంత ఖరీదైనవి నీకెలా వచ్చిందని ప్రశ్నించాడు. సుబ్బమ్మ అసలు విషయం చెప్పలేక నీళ్లు నమిలే సరికి తిప్పడికి పెళ్ళాం మీద అనుమానం వచ్చి ఎవడి తో పడుకొని సంపాదించావో చెప్పమంటూ చావ కోట్టడం తో మొగుడి దెబ్బలు భరించలేక ఏడుస్తూ అసలు జరిగిన విషయం అంతా చెప్పేస్తుంది . ఈ మొగుడు పెళ్ళాలా గొడవ చూసిన అమ్మలక్కలంతా విమలుడు ని చంపిన ముసుగు మనుషులు గురించి ,వారు విక్రముడు సుసేనుడి లా ఉండటాన్ని గురించి, దేవకీ పనిమనిషి సుబ్బమ్మ కి గాజులుని ఇవ్వడం గురించి కథలు కథలు గా ఊరంతా పాకించేశారు.
ఇక దేవకీ ఇంట ఆ రాత్రి ఎంతో హడావుగా వుంది కారణం పంచముఖి కి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఎవరూ కూడా ఆ రాత్రి నిద్రపోలేదు. పంచముఖి తొలి ఝామున మగ బిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డను చూసిన ప్రతి ఒక్కరు అచ్చు వాడి తండ్రి గజేంద్రుడి పోలిక తో వున్నాడని అనుకోసాగారు. ఆ ఇంట మన వడు పుట్టిన ఆనoదంలో అందరూ సంబరాలు చేసుకోసాగారు ఒక్క సుషేణుడు తప్ప. తన చెల్లి కడుపులో పెరిగే బిడ్డ తనది కూడా కావచ్చేమో అని ఇన్నాళ్లు అనుకొన్న సుసేనుడికి గజేంద్రుడి పోలిక తో పుట్టిన బిడ్డ నచ్చలేదు. వాడి మనసు బిడ్డను కనీసం తాకడానికి కూడా ఇష్టపడలేదు. వాడు ఈ సంబరాలకు కొంచం దూరం గానే ఉండసాగాడు.తెల్లవారుజామునే ఈ వార్తను బావ గజేంద్రుడికి