వంశాచారం 36
naa telugu kathalu వంశాచారం 36 విక్రముడు కళ్ళు మెల్లగా మూసుకుపోతుండగా.. ఆ ఇద్దరు కూడా చిన్న చిన్న అణువులలాగా విడిపోతూ గాలి లో కలిసిపోవడాన్ని చూస్తూ నేలకొరిగాడు. ఆ మండపం నుంచి మూడు అమ్మాయిల రూపాలు గాలి లో నుంచి ఆకాశం కేసి ఎగురుతూ అదృశ్యమైంది. ఆ మూడవ స్త్రీ రూపం బహుశా కొన్ని శతాబ్దాలకు ముందు ఈ ఆచారాల్ని వ్యతిరేకించి ఇదే మండపం లో ఆత్మ త్యాగానికి పాల్పిడిన ఊర్వశి ధీ కావచ్చు.
ఇన్ని హత్యలు జరగడానికి గల కారణాలను గాని , చేసిన వారిని గాని , ఎవ్వరూ ఆ తరువాత కాలం లో కనుక్కోలేక ఆ హత్యలన్నీ ఒక mystery గా మిగిలిపోయింది.
తరువాతి కాలం లో ఆ మూడు వంశాలలో వున్న మిగిలిన అమ్మాయిలు , శ్వేత సుష్మలు ఊహించిన విధం గానే వేరే వంశం వాళ్ళను పెళ్లాడడం తో ఈ ఆచారాలు అన్ని మరుగున పడి కాలక్రమేణా ఆ వంశాల పేర్లు కూడా వినిపించకుండా పోయాయి.
రాజేశ్వరి దేవి చనిపోయాక నారయ్య కౌలు కి చేస్తున్న పొలం వాడికే సొంతమయ్యింది. ఆ పొలం తో సుమతి తో హాయిగా ఇన్నాళ్లు విడిచిన స్వర్గ సుఖాలను అనుభవించసాగాడు.సుమతి ఆరోగ్యాన్ని ద్రుష్టి లో పెట్టుకొని తన కోసం వేరుగా పిల్లలు ను కనకుండా సుమతి కి పుట్టిన ఇద్దరు పిల్లలని తన